మహేశ్ చాలా బిజీగా ఉంటున్నారు, ఆయన రాజకీయాల్లోకి వచ్చే సమయం లేదని మహేష్ భార్య నమ్రతా తెలిపారు. 2019 ఎన్నికల్లో టీడీపీకి సూపర్ స్టార్ మహేష్ బాబు సపోర్ట్ చేయబోతున్నారంటూ, త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో భాగంగా మహేష్ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారని పలు మీడియాల్లో, సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగాయి. కాగా.. ఈ వార్తలపై మహేష్ భార్య నమ్రతా ఓ మీడియా ద్వారా ఈ వార్తలపైక్లారిటీ ఇచ్చారు.
ఒకవేళ మహేష్ సమయం దొరికినా ఫ్యామిలీతోనే గడుపుతారు తప్ప ఇతర విషయాల్లో జోక్యం చేసుకోరు. కనీసం రాజకీయాల గురించి కూడా నాతో చర్చించరు. తన ఫ్రెండ్స్ని కలవడానికి కూడా మహేష్కి టైం దొరకదని అన్నారు. రాజకీయాలతో సంబంధంలేని నటుల్లో మహేష్ ఒకరు. రెండు తెలుగు రాష్ట్రాలూ బావుండాలని మేము కోరుకుంటున్నాము. కాగా.. మహేష్ ప్రస్తుతం ‘మహర్షి’ సినిమాతో బిజీగా ఉన్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ఏప్రిల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.