భజ్జి వరల్డ్ కప్… జట్టు!

ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ దగ్గర పడుతున్న సమయంలో ఆటగాళ్లను ఎలా తీసుకోవాలో, ఏఏ స్థానాలలో పంపించాలో తెలియక సెలక్టర్లు మధన పడుతూ… సమాలోచనలు జరుపుతున్నారు. అయితే ఆస్ట్రేలియా సిరీస్‌ ముగిసిన అనంతరం టీం ఎంపికపై ఒక స్పష్టత రావొచ్చు. అయితే తాజాగా టీమిండియా మాజి స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ తన జట్టును ఎంపిక చేశాడు. న్యూజిలాండ్‌ పర్యటనలో జట్టును ఆదుకున్న విజయ్‌ శంకర్‌ను తన జట్టులోకి తీసుకోవడం విశేషం. పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌, స్పిన్నర్‌ రవీంద్ర జడేజాను తన జట్టులో చోటిచ్చాడు. ఫామ్‌లో లేని కేఎల్‌ రాహుల్ తో పటు, టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ను పక్కన పెట్టడం గమనార్హం.

ఇంగ్లాండ్‌లో వేడిమి ఎక్కువగా ఉంటుందని, ప్రత్యర్థి జట్టులో ఎక్కువ మంది కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్‌ ఉంటే రవీంద్ర జడేజా బౌలింగ్  ఉపయోగపడుతుందని తెలిపాడు. ప్రత్యర్థి జట్టులో ఆరుగురు కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్‌ ఉంటే జడ్డూను జట్టులో చేర్చితే మంచిదని పేర్కొన్నాడు. ఇక బజ్జి వరల్డ్ కప్ జట్టు ఇలా ఉండనుంది. రోహిత్‌ శర్మ, శిఖర్ ధావన్‌,విరాట్‌ కోహ్లీ, అంబటి రాయుడు, ఎంఎస్‌ ధోనీ, కేదార్‌ జాదవ్‌, దినేశ్‌ కార్తీక్‌, హార్దిక్‌ పాండ్య, కుల్‌దీప్‌ యాదవ్‌, యుజువేంద్ర చాహల్‌, జస్ప్రీత్‌ బుమ్రా,  భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ షమి, ఉమేశ్‌ యాదవ్‌, విజయ్‌ శంకర్‌, ప్రాబబుల్: రవీంద్ర జడేజా.  

leave a reply