సరదగా ఫ్రెండ్స్తో కలిసి ఫుడ్ తినడానికి వెళ్లిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్కు ఆ హోటల్ వాళ్లు వేసిన బిల్లు చూసి కళ్లు తిరిగాయట. ఏంటి అంత బిల్ వేసారా..? అనుకుంటున్నారా..? అవును.. లక్ష కాదు, రెండు లక్షలు కాదు ఏకంగా అక్షరాలా రూ.10 లక్షల బిల్ వేసారట. లండన్లో ఉన్న మన హీరోయిన్ ఓ పది మంది ఫ్రెండ్స్తో ఓ స్టార్ హోటల్కు వెళ్లారట. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తిన్నారట. ఆ తర్వాత వచ్చిన బిల్లును చూసి ఆమెకు కళ్లు తిరిగాయని తాజాగా ఓ ఇంటర్య్వూలో చెప్పుకొచ్చింది.
సాధారణంగా.. స్టార్ హోటల్స్లో రేట్లు రకుల్కి తెలియనివి కావు. కానీ ఈ స్థాయి రేట్లు మాత్రం తాను ఎక్కడా చూడలేదనీ, పది మంది కలిసి విందు చేస్తే పది లక్షల బిల్లు కావడం తనకి చాలా ఆశ్చర్యంగా అనిపించిందని చెప్పుకొచ్చింది. దీంతో.. ఇకపై ఆ వైపుకు వెళ్లను కూడా వెళ్లనని ఒట్టు పెట్టుకుందట!