వివాహ వేడుక..పయనమైన అతిరథులు!

టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి తన కుమారుడి వివాహం జయపురలో  అంగరంగ వైభవంగా జరపనున్నట్లు తెలుస్తుంది ఈ మేరకు టాలీవుడ్ ప్రముకులంధరు తరలి వెళ్తునట్లు సమాచారం. కార్తికేయ, పూజా ప్రసాద్‌ల వివాహ వేడుకకు జయపుర కుకాస్‌లో ఉన్న 5 స్టార్  హోటల్‌లో డిసెంబరు 30న ఈ వేడుక జరగనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాజమౌళి కుటుంబంతోపాటు టాలీవుడ్‌ సినీ ప్రముఖులు కూడా జయపురకు‌ చేరుకున్నారు. అక్కినేని నాగార్జున, రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌, ప్రణతి, అభయ్‌రామ్‌, ప్రభాస్‌, రానా, నాని, జగపతిబాబు తదితరులు జయపుర‌ విమానాశ్రయంలో ఉండగా తీసిన ఫొటోలు సోషల్‌మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి  .

అయితే నవంబరులో కార్తికేయ, పూజల నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. డిసెంబరు 28 నుంచి డిసెంబరు 30 వరకు మూడు రోజులపాటు వీరి వివాహ వేడుక జరగనుందట. ఇప్పటికే ఇరువురి కుటుంబాలు జైపూర్ కు చేరుకున్నాయి. శుక్రవారం రాత్రి ఘనంగా వివాహ విందు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. శనివారం సంగీత్‌, మెహెందీ వేడుకలు నిర్వహించనున్నారట. ఆదివారం కుటుంబ సభ్యులు, దాదాపు 300 మంది అతిథుల రానున్నట్లు తెలుస్తుంది. జగపతిబాబు సోదరుడు రాంప్రసాద్ కుమార్తె పూజా ప్రసాద్‌-కార్తికేయ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. పూజా ప్రసాద్‌ గాయనిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

leave a reply