‘మహర్షి’ని కలిసిన ‘దేవ్‌’

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబును, హీరో కార్తీ కలిశారు. ‘మహర్షి’ సెట్‌కు కార్తీ వెళ్లి కలిసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్తా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. హీరోలిద్దరూ కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. కానీ మహేష్‌ను కార్తీ అనుకోకుండా కలుసుకున్నారా.. లేక ఏదైనా పనిలో కలిశారా అనేది తెలియాల్సి ఉంది. అక్కడ వంశీపైడిపల్లి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు బయటకొచ్చాయి. ప్రస్తుతం ‘మహర్షి’ చిత్రం రామోజీఫిల్మ్‌ సిటీలో షూటింగ్‌ జరుపుకుంటోంది. మహేష్‌ ప్రస్తుతం ‘మహర్షి’ సినిమాలో నటిస్తున్నారు. దిల్‌రాజు, అశ్వనీదత్‌, ప్రసాద్‌ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ఏప్రిల్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ‘దేవ్‌’ చిత్రంలో కార్తి, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా నటించారు. ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

leave a reply