సరోగసీ విధానం ద్వారా రెండేళ్ల క్రితం ఇద్దరు కవల పిల్లలకు తండ్రి అయిన బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్.. ఓ మహిళా నెటిజన్పై ఫైర్ అయ్యారు. కరణ్.. పిల్లలను తల్లి ప్రేమకు దూరం చేశారంటూ ఓ మహిళా నెటిజన్ ట్విటర్లో కామెంట్స్ పెట్టారు. అయితే ఈ కామెంట్స్ చూసిన కరణ్ జోహార్ రియాక్ట్ అవుతూ.. ”ఇలాంటి అనవసర కామెంట్లు పెట్టి కాలం వృథా చేసుకునే బదులు ఏదన్నా పని ఉంటే చేసుకోండి”. దేశంలో పట్టించుకోవాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి. నా పిల్లలకు దక్కాల్సిన ప్రేమ దక్కుతోంది. నాకు అది చాలు. వారికీ తల్లి ఉంది. మా అమ్మే నా పిల్లలకీ తల్లి. అర్థమైందా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. యశ్, రూహి వచ్చాక తన జీవితం మారిపోయిందని కరణ్ తెలిపారు. వారికి తల్లిలేని లోటు తెలియకుండా పెంచుతానని చెప్పారు.
మేడమ్.. నా పిల్లలకు తల్లి ఉంది
Post navigation
Posted in: