బాలకృష్ణ కెరీర్లో బిగ్గెస్ట్ మూవీ ఏదంటే `ఎన్టీఆర్ – కథానాయకుడు’ అనే చెప్పాలి. శ్రమకు తగ్గ ఫలం లభించిందనే చెప్పాలి. బాలకృష్ణ ప్రధాన పాత్రలో క్రిష్ డైరెక్షన్ తెరకెక్కిన ‘ఎన్టీఆర్-కథానాయకుడు’ తొలిరోజు బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు సాధించింది. బాలకృష్ణ నటించిన `గౌతమీ శాతకర్ణి’ ఓపెనింగ్స్ రికార్డ్స్ను బద్దలు కొట్టింది.
భారీ అంచనాలతో ఈ సినిమా అభిమానుల ముందుకు వచ్చింది. దాదాపు అన్నీ థియేటర్స్లో `కథానాయకుడు’నే ప్రదర్శించబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా వెయ్యికి పైగా స్ర్కీన్లలో విడుదల చేశారు. కాగా.. అమెరికాలోని తెలుగు ప్రేక్షకుల కోసం ఈ సినిమా ప్రీమియర్ షోను మంగళవారం ప్రదర్శించారు. నిన్నటి నుంచి ఈరోజు ఉదయం వరకు వేసిన షోలతో ‘యన్టిఆర్’ చిత్రం 4,40,000 డాలర్లు (రూ. 3,09,87,000) రాబట్టినట్లు సినీ విశ్లేషకులు సోషల్మీడియా ద్వారా తెలిపారు.
గతంలో కూడా బాలకృష్ణ, క్రిష్ కాంబినేషన్లో వచ్చిన ‘గౌతమీ పుత్రశాతకర్ణి’ సంక్రాంతికి విడుదలై మొదటిరోజు ఓపెనింగ్స్ రూ.18.50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అలాగే ‘ఎన్టీఆర్-కథానాయకుడు’ కూడా రూ.21 కోట్ల వసూలు చేసి బాక్సాఫీస్ రికార్డును బ్రేక్ చేసింది. అంచనాల ప్రకారమే మంచి టాక్తో ఎన్టీఆర్ `కథానాయకుడు’ రన్నింగ్ అవుతుంది. పండగ సీజన్ కావడంతో అడ్వాన్స్ బుకింగ్ కూడా అదే స్థాయిలో జరిగింది.