నేను వాళ్లలా కాదు..

గురువారం కడప జిల్లా పార్టీ నేతలతో విజయవాడలోని పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ తర్వాతే జనసేన సంస్థాగత కమిటీల ఏర్పాటు ఉంటుందని తెలిపారు. జనసేనకు యువత, మహిళలే ప్రధాన బలమని, యువశక్తి రాజకీయ శక్తిగా మారడానికి కొంత సమయం పడుతుందని పవన్‌ అన్నారు. జనసేన పార్టీకి కొన్ని ప్రత్యేకమైన సిద్ధాంతాలు ఉన్నాయన్నారు. నేను ప్రజల కోసమే శ్రమిస్తున్నా తప్ప.. సీఎం సీటు కోసం కాదన్నారు. ఈ కుట్ర రాజకీయాల గురించి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడానికి నేను వచ్చా రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందన్నారు.

నేను ఏ పార్టీకీ మద్దతుదారుడిని కాదన్నారు. నా కోసం.. ప్రజల కోసంమే ఈ పార్టీ అన్నారు. కొన్ని పార్టీలు రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాయని మండిపడ్డారు. వారి సొంత ప్రయోజనాల కోసం పార్టీలని అడ్డం పెట్టుకుంటున్నాయన్నారు. వాళ్లకు ఎంతసేపూ అధికార దాహమే తప్ప ప్రజల సంక్షేమం పట్టదని ఆరోపించారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్‌పై విమర్శలు చేస్తూ.. ప్రతిపక్ష నేత జగన్‌ మాదిరిగా సీఎంను కాల్చేయండి.. చంపేయండి వంటి మాటలు తాను మాట్లాడనన్నారు. నేను వ్యక్తిగతంగా విమర్శలు చేయనని స్పష్టంచేశారు.

leave a reply