అసలు నిజాలు అందులోనే..

`ఎన్టీఆర్‌ – కథానాయకుడు’ సినిమా రిలీజ్‌ అయి మంచి టాక్‌తో బాక్స్‌ ఆఫీస్‌లో దూసుకెళ్తుంది. బాలయ్య నటన అద్భుతమంటూ అందరూ తెగ పొడిడేస్తున్నారు. కాగా ఈ సినిమా రెండు భాగాలుగా నిర్మితమైంది. మొదటి ఆఫ్‌ `కథానాయకుడు’ రిలీజై సంచలనం సృష్టిస్తుంది. అయితే.. తాజాగా ఈ సినిమాపై లక్ష్మీ పార్వతి స్పందించారు.

“ఎన్టీఆర్” బయోపిక్‌ను తీస్తున్నట్లుగా కూడా నాకు చెప్పలేదు. నన్ను రామ్‌గోపాల్‌ వర్మనే `లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ గురించి కలిశాడు. ఈ రోజు ఎన్టీఆర్‌ `కథానాయకుడు’ సినిమా రిలీజైంది. చూడమని కూడా.. నన్నెవరూ నన్ను ఆహ్వానించలేదు. చంద్రబాబు కనుసన్నలలోనే ఈ బయోపిక్ రూపొందింది ఆవిషయం నాకు తెలుసు. అందువలన ఎన్టీఆర్‌కి సంబంధించిన పూర్తి వాస్తవాలు తెరకెక్కే అవకాశం లేదు. అందరూ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదల కోసమే ఎదురుచూస్తున్నారు. ఉన్నది ఉన్నట్టుగా ఎన్టీఆర్ బయోపిక్‌ను రూపొందించే ధైర్యం రామ్‌గోపాల్‌ వర్మకి మాత్రమే వుంది అంటూ లక్ష్మీపార్వతి తెలిపారు.

leave a reply