అసలే కోతి… ఆపై కళ్లు తాగింది.. ఏమైనా ఉందా..?

ఉత్తర దక్షిణ దృవాలను కలిపిన ఘనత కేసీఆర్‌దన్న నారాయణ

కాంగ్రెస్, టీడీపీ ఉత్తర దక్షిణ ధృవాలని కానీ ఆ ఉత్తర దక్షిణ ధృవాలను ఏకం చేసే శక్తి  కేసీఆర్, మోడీకి వచ్చాయని సిపిఐ నేత నారాయణ విమర్శించారు. టీఆర్ఎస్ దుష్టపాలనను అంతమొందించేందుకే ప్రజాకూటమి ఏర్పడిందన్నారు. జూబ్లీహిల్స్ లో జరిగిన మహాకూటమ సభలో నారాయణ మాట్లాడుతూ..“ కూటమి పేరుతో అపవిత్ర రాజకీయాలు చేస్తున్నారని ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని, బక్కొన్ని ఒక్కన్ని ఎదుర్కొనేందుకు నలుగురు ఏకమయ్యారని పదే పదే అంటున్నారని, ఉత్తర దక్షిణ దృవాలు అయినా కాంగ్రెస్, టిడిపిలు ఎందుకు కలిశాయో చెప్పాలని ప్రశ్నిస్తున్నాడని, ఉత్తర దక్షిణ దృవాలను కలిపే శక్తి కేసీఆర్ కు ఉందని, కేసీఆర్ దుష్ట పాలనను అంతమొందించేందుకే ఉత్తర దక్షిణ దృవాలైన టీడీపీ, కాంగ్రెస్ కలిశాయని, కేసీఆర్ పాలనను అంతమొందించాలనే ఉప్పు నిప్పు ఒక్కటయ్యాయని, మల్లయుద్దంలో లాగా నరేంద్ర మోడీ దుష్ట కూటమికి నాయకుడని,  ఆ నాయకునికి మద్దతు ఇచ్చేవాడు ఈ కేసీఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్‌ని కోతితో వర్ణిస్తూ.. అసలే కోతి ఆ పై కల్లు తాగింది. ఇక ఏమన్న ఉంటదా.. అందుకే ఏం మాట్లాడుతున్నాడో కూడా ఆయనకు అర్ధమైత లేదు. మహాకూటమిగా మేం ఏర్పడి పని చేస్తుంటే నీకెందుకు కడుపు మంట అని ప్రశ్నిస్తున్నాను. 2009 లో మహా కూటమిగా సిపిఎం, సిపిఐ, టిడిపిలతో టిఆర్ఎస్ జత కట్టింది మర్చిపోయావా. అంటే నువ్వు చేస్తే సంసారం.. వేరే వాళ్లు చేస్తే  అది వ్యభిచారమా అని పశ్నించారు.

కేసీఆర్ నీకు దమ్ముంటే, నీవు నిజమైన ముఖ్యమంత్రివి అయితే చార్మినార్ దగ్గరకు వెళ్లి నేనే ముఖ్యమంత్రినని చెప్పు. లేకుంటే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలను ఖండించు. అంత దమ్ము దైర్యం నీకు లేదు. ఎందుకంటే నీవు ఎంఐఎం చెంచాగా పని చేస్తున్నావు. ఆ విషయం ప్రజలందరికి తెలుసు. సిగ్గు లేకుండా మళ్లీ మాట్లాడుతున్నావు. అసలు నువ్వు మనిషివేనా.. నీకు సంస్కారం ఉందా.. ఏం మనిషివయ్యా.. అంటూ తిట్ల దండకం ఎత్తుకున్నారు.

ఓల్డ్ సిటికి మెట్రో ఎందుకు రాలేదో కేసీఆర్ చెప్పాలని, హైదరాబాద్ కు మెట్రో రాకుండా కేసీఆర్ అడ్డుకున్నారని, ఆనాడు మెట్రోని వ్యతిరేకించిన వ్యక్తి కేసీఆర్. నాకు ఫోన్ చేసి అన్నా.. హైదరాబాద్ కు మెట్రో అవసరం లేదు. మీరు నాతో కలిసి వస్తే మెట్రోను అడ్డకోవచ్చన్నారు. ఈ మాట నాతో కేసీఆర్ అన్నది వాస్తవమా కాదా చెప్పాలని, కాల్ డేటా బయటికి తీయాలని, అభివృద్దిని అడుగు అడుగున అడ్దుకున్న దుర్మార్గుడు కేసీఆర్.. ఇవాళ సిగ్గు లేకుండా గొప్పలు చెబుతున్నాడని, సొమ్ము ఒకనిది సోకు ఒకనిది అన్నట్టుగా కేసీఆర్ వ్యవహారం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్, కేటిఆర్ లు ఇసుక మాఫియా పై సంవత్సరానికి 30 వేల కోట్ల రూపాయలు దోచుకుతింటున్నారని, నేరేళ్లలో ఇసుక మాఫియాను పెంచి పోషించి అమాయకులను చిత్రహింసలు పెట్టారని, బిడ్డా కేసీఆర్.. ఇసుక రీచ్ లలో నీకున్న సంబంధాలను ఆధారాలతో సహా బయటపెడుతాను. నువ్వు నీ కొడుకు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. అందరిని అయ్యా జాగీరా అంటూ బెదిరిస్తావు.. మరి నీ అయ్య జాగీరా తెలంగాణ.. ఏమనుకుంటున్నావు. నీ కల్ల బొల్లి మాటలకు భయపడే వారు ఎవరు లేరు. ఢిల్లీలో నిర్ణయిస్తారు. ఇక్కడ ఏం ఉండందంటూ మాట్లాడుతున్నావు.. నువ్వు సోనియాగాంధీ చుట్టు తిరిగి.. తెలంగాణ ఇచ్చిన తల్లిగా పొగిడి ఆమెకు సాష్టాంగ నమస్కారం చేశావు. అప్పుడే మర్చిపోయావా.. సిగ్గులేదు. ఏం మాట్లాడుతున్నవో నీకైనా అర్ధమైతుందా కేసీఆర్”  అంటూ నారాయణ కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శించారు.

leave a reply