ఈడీ అధికారులు వేధిస్తున్నారు – రేవంత్ రెడ్డి

‘ఓటుకు నోటు’ కేసులో వరుసగా రెండో రోజున హాజరైన రేవంత్ రెడ్డి విచారణ ముగిసింది. అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఈడీ అధికారులు విచారణ పేరిట నిన్నటి నుంచి అడిగిన ప్రశ్నలే అడుగుతున్నారని, తనను వేధిస్తున్నారని ఆరోపించారు. ఏపీ సీఎం చంద్రబాబు టార్గెట్‌గా ఈడీ అధికారుల ప్రశ్నలు ఉన్నాయని అన్నారు.కేసీఆర్‌ భుజాలపై తుపాకీ పెట్టి చంద్రబాబును కాల్చాలని మోదీ చూస్తున్నారు అని రేవంత్ తెలిపారు. ఈ కేసు విషయంలో చంద్రబాబుకు గతంలోనే క్లీన్ చిట్ ఇచ్చినా, మళ్లీ ఆయన పేరును తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.ఈ కేసులో రాజకీయ కుట్ర కనిపిస్తుందని కేసీఆర్‌, మోదీ ఒత్తిడితో ఈడీ అధికారులు పనిచేస్తున్నారు అని ఆయన తెలిపారు.

leave a reply