తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు స్పందించారు. బుధవారం ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన జ్ఞానభేరి సభలో పాల్గొన్న సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడికైనా వెళ్లొచ్చు.. రావొచ్చని.. ఏమైనా చేయవచ్చని అన్నారు. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి పోటీ పడిన సీఎంచంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై.. చంద్రబాబు స్పందిస్తూ సీఎం కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ వచ్చి నాకేదో గిఫ్ట్ ఇస్తానని అన్నారు..అది ఏమైనా నేను ఆనందిస్తానని అన్నారు. తెలుగు జాతి సంక్షేమం కోసమే దివంగత ఎన్టీఆర్ టీడీపీ పార్టీ పెట్టారని, ఎక్కడైనా తెలుగు వారికి ఆపద వస్తే ఆదుకుంటామని అన్నారు. కొందరు అటూ ఇటూ లాలూచీ కోసం పార్టీలు మారతారేమో కానీ.. తాము ఎల్లప్పుడూ తెలుగువారికోసం ఎక్కడ ఉన్నా శ్రమించేందుకు సిద్ధమన్నారు.