రాజధాని గురించే మాట్లాడాలి..

బుధవారం ప్రకాశం జిల్లాలో జరిగిన జ్ఞానభేరి సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా తాజ్‌మహల్‌ తర్వాత ఏపీ గురించే మాట్లాడే పరిస్థితి వస్తుందని సీఎం అన్నారు. ప్రపంచం మొత్తం మెచ్చుకునేలా అమరావతి రాజధాని నిర్మాణం చేపడతామని తెలిపారు. నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలని, ఇదే మంచి సమయమని ప్రతి ఒక్కరూ దూరదృష్టితో భవిష్యత్తుకై ఆలోచించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. జ్ఞాన భేరిసందర్భంగా విద్యార్థులు రూపొందించిన పలు ఆవిష్కరణలను చంద్రబాబు పరిశీలించారు. ఉత్తమప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు ప్రదానం చేశారు.

leave a reply