ఎక్కడ నుంచి వస్తానో.. అప్పుడు చెప్తా..

ఎప్పుడు రావాలో అప్పుడే వస్తా..

ప్రజలు అనుకున్న ప్రకారం రాజకీయ వ్యవస్థ నడుచుకోవట్లేదని జనసేన అధ్యక్షుడు పవన్‌ విమర్శించారు. నాయకులు కేవలం ఓటు బ్యాంకుగా పరిగణించినంత కాలం ఎక్కడా అభివృద్ధి జరగదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేసే విషయం ఫిబ్రవరిలో తప్పక చెప్తానని మీడియాకి తెలిపారు. అనంతపురం పర్యటనలో భాగంగా పవన్‌ మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత జగన్‌ ఎప్పుడు అసెంబ్లీకి వెళ్లి.. అనంతపురం కరవు గురించి పశ్నిస్తారని విమర్శలు చేశారు. రాష్ట్రంలోని రైతులంతా సంతోషంగా ఉన్నారని చంద్రబాబు జాతీయ మీడియాను నమ్మించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరువు తీవ్ర స్థాయిలో ఉందని ఆవేదన చెందారు. రైతులు పడుతున్న కష్టాలను కప్పిపుచ్చి భ్రమలు కల్పిస్తున్నారన్నారు. ఇలాంటి రైతులందరికీ జనసేన మద్దతుగా నిలుస్తుందన్నారు. చేనేత కార్మికుల బాధలు చూస్తుంటే ఆవేదన కలుగుతోంది. దీని పరిష్కారం కోసం దీర్ఘకాలిక పరిష్కారం కోసం జనసేన ఆలోచిస్తోంది.

leave a reply