‘ఎన్టీఆర్‌ బయోపిక్‌’పై కామెంట్‌ ప్లీజ్‌

విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్‌ బయోపిక్‌ ‘కథానాయకుడు’ సంక్రాంతికి విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో నటుడు బాలకృష్ణ అద్భుతంగా నటించి అన్నాగారిని గుర్తుచేశారు అని పలువురు ప్రశంసించారు కూడా.  కాగా.. ఎన్టీఆర్‌ బయోపిక్‌కు మొదట తేజ డైరెక్షన్‌లో శ్రీకారం చుట్టగా.. ఆయన కొన్ని కారణాల వల్ల తప్పుకున్నారు. ఆ తరువాత డైరెక్షన్‌ బాధ్యతలు డైరెక్టర్‌ క్రిష్‌ వహించి ఎన్టీఆర్‌ బయోపిక్‌ను ‘కథానాయకుడు’, ‘మహానాయకుడు’గా రెండు పార్ట్స్‌ను చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ ‘మహానాయకుడు’ సినిమా చిత్రీకరణ జరుపుకుంటుంది.

కాగా.. ఈ సినిమాపై స్పందించాలని మీడియా డైరెక్టర్‌ తేజను ప్రశ్నించగా.. ‘ నా తర్వాతి సినిమా చిత్రీకరణలో చాలా బిజీగా ఉన్నాను’ అంటూ సమాధానమిచ్చారు. నాకు ఎన్టీఆర్‌ బయోపిక్‌ చూసే సమయం దొరకలేదు. అందుకే నేను స్పందించలేకపోతున్నా అని సమాధానమిచ్చారు. చూసి ఉంటే తప్పక మీతో షేర్‌ చేసుకునేవాడ్ని. అనంతరం సినిమాలో ఇంకాస్త డ్రామా ఉంటే బాగుండేదా? అని ప్రశ్నించగా.. ‘అది దర్శకుడిపై ఆధారపడుతుంది. ఆయనే తన పనితనాన్ని చూపించాలి’ అని చెప్పారు. అయితే..‘యన్‌టీఆర్‌-మహానాయకుడు’ చిత్రాన్ని ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నారు.

leave a reply