ఏపీ లో దొరలు,దొంగలు ఆటలు సాగవు – చంద్రబాబు

విజయవాడలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడారు. బిహార్‌ నుంచి వచ్చిన దొంగల ముఠా ఏపీలో ఓట్లు తీసేస్తున్నారని చాల జాగ్రత్తగా ఉండాలని గంటా మురళి పార్టీలో చేరిన సందర్భంగా చంద్రబాబు కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. వచ్చే 5 రోజులు చాల కీలకమైనవి అని ప్రతిరోజూ ఓట్ల జాబితాలో ఓటు ఉందో లేదో సరిచూసుకోండి అని కార్యకర్తలకు సూచించారు. అదే సమయం లో బతికున్న మనుషుల్ని చంపేస్తున్నారు అని,మా డేటా పోతే మీకెందుకు బాధ అని,తెలంగాణలో ఓట్లు తీసేసినట్లు ఆంధ్రలో కూడా చేద్దాం అనుకుంటే కుదరదని కేసీఆర్ ని ఏకి పారేశారు. కేసీఆర్ తెలంగాణలో 27 లక్షల ఓట్లు తీసేయిస్తే ఎవరూ మాట్లాడలేదని అన్నారు. తన దగ్గర పనిచేసిన కేసీఆర్‌కే ఇంత ఉంటే నాకు ఎంత రోషం ఉండాలి అని ఒకింత ఆవేశానికి లోనయ్యారు. తను పడిన కష్టానికి ఇవాళ హైదరాబాద్ కి ఆదాయం వస్తుందని,కెసిఆర్ వాళ్ళ కాదని తెలిపారు.

జగన్‌ ఎప్పుడైనా అమరావతికి వచ్చారా?. ఈ గడ్డపై నమ్మకం లేని వ్యక్తికి ఇక్కడ పోటీ చేసే అర్హత లేదు అన్నారు. జగన్,కేసీఆర్ ఇద్దరు కలసి మనకు ఎంత అన్యాయం చేస్తున్నారో ప్రజలు అంతా గమనించాలి అని కోరారు. తాను చేసిన అభివృద్ధిని,కొనసాగిస్తున్న సంక్షేమ పధకాలను చూసి మరోసారి తనను ఆశీర్వదించండి అని,ఆయన ప్రజలను కోరారు.

leave a reply