నెంబర్వన్ బ్యాట్స్ మెన్గా విరాట్ కోహ్లీ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. టాప్ ర్యాంక్లోఉన్న విరాట్.. తాజాగా 14 పాయింట్లు సాధించి మొత్తం 934 పాయింట్లతో ర్యాంకింగ్స్లోమొదటి స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియాతో పెర్త్లో జరిగిన రెండవ టెస్ట్ మొదటిఇన్నింగ్స్లో విరాట్ విరోచిత సెంచరీ చేసిన విషయం తెలిసిందే.
కాగా.. ఆ ఇన్నింగ్స్లో అతను 123 రన్స్ చేశాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్.. బ్యాటింగ్ ర్యాంకుల్లో రెండవ స్థానంలో నిలిచాడు. కోహ్లీ, విలియమ్సన్ మధ్య 19 పాయింట్ల తేడా ఉంది. ఇతర ప్లేయర్లు టామ్ లాథమ్, ఏంజిలో మాథ్యూస్, నాథన్ లియాన్లు కూడా తమ ర్యాంక్ను మెరుగుపరుచుకున్నారు. భారత బౌలర్లలో షమీ, బుమ్రాలు కూడా తమ ర్యాంక్ను మెరుగుపరుచుకున్నారు.