ప్రస్తుతం దేశమంతా ఒకటే చర్చ తెలంగాణ ఎన్నికలు. ఎన్నికలైతే జరిగాయి.. కాని మరి ఎవరు అధికారంలోకి రానున్నారు.. అనేదానిపై అందరూ ఆసక్తిగా ఉన్న విషయం తెలిసిందే.. ఆ అధికారం కోసం తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలని ఇప్పటికే కొన్ని పార్టీలు కూటమిగా ఒకటైయ్యాయి. ఇప్పుడు కొత్తగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సోమవారం ఉదయం ఆపద్ధర్మ సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. కాగా.. ఆయన కేసీఆర్తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో టీఆర్ఎస్ తప్పకుండా మళ్లీ అధికారంలోకి వస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. అంతేకాకుండా మేము జాతీయ రాజకీయాల గురించి కూడా చర్చించుకున్నామన్నారు. తామెప్పుడూ టీఆర్ఎస్కు మద్దతుగానే ఉంటామని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ విజయం పట్ల కేసీఆర్ కూడా నమ్మకంగా ఉన్నారని అసదుద్దీన్ తెలిపారు.