బాలక్రిష్ణ తెలీదంటూ.. ఈ గ్లాస్లో తాగితే సుఖంగా ఉంటుందంటూ.. ఈ మధ్య సోషల్ మీడియాలో ప్రభంజనం సృష్టిస్తున్న మోగా బ్రదర్ నాగబాబు.. ప్రస్తుతం నడుస్తున్న `బయోపిక్ ట్రెండ్’పై తన దైన రీతిలో ట్వీట్ చేశారు. “కట్టు కథలు కొన్ని.. కల్పనలు ఇంకొన్ని.. చుట్టనేల.. మూట కట్టనేల.. నిజం కక్కలేని బయోపిక్కులొద్దయా.. విశ్వదాభిరామ.. వినరా మామా”.. అంటూ ‘కవిత్వాలు మాకు వచ్చండోయ్’ అనేది బ్రాకెట్లో పెట్టారు. పెట్టిన పోస్ట్తో సోషల్ మీడియా నుంచి.. మోగా అభిమానుల నుంచి.. జనసేన కార్యకర్తల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది.
కాగా.. ఈ పోస్ట్తో బాలయ్య అభిమానులు ఆగ్రహానికి గురై.. నాగబాబుకు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు. అలాగే.. ఈ పోస్ట్లో ‘స్టే ట్యూన్డ్’ అని వ్యాఖ్యానించడం ద్వారా, ఇకపై తన సోషల్ మీడియా పేజీ నుంచి ఇలాంటి సెటైర్లు వరుసగా ఉంటాయనే హింట్ కూడా నాగబాబు ఇచ్చినట్టు తెలుస్తోంది. అలాగే.. రాంగోపాల్ వర్మ, నాగబాబు మంచి మిత్రులని కూడా తెలుసు. ఒకవేళ వర్మకు మద్దతు తెలపడానికే నాగబాబు ఈ రకమైన పోస్ట్ చేశారా అని మరికొందరి ఆలోచన.
మొత్తానికి.. మోగా బ్రదర్స్ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం కొత్తగా.. ఎటు దారితీస్తుందో..? మామూలుగా గాసిప్స్ పట్టించుకోని.. దూరంగా ఉండే కొణిదెల కుటుంబం నుంచి ఇలాంటి కామెంట్స్ ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయడం జనాలకు కొత్తగా ఉంది.