నాగబాబు, వరుణ్ తేజ్..విరాళం

జనసేన పార్టీకి విరాళం ప్రకటించిన మెగా బ్రదర్ నాగబాబు, ఆయన కుమారుడు వరుణ్ తేజ్. పార్టీ అభివృద్ధి కోసం నాగబాబు రూ.25 లక్షలు ప్రకటించగా, వరుణ్ తేజ్ రూ.కోటి రూపాయలను విరాళమిచ్చారు. ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విటర్ ద్వారా తెలిపారు. అంతేకాకుండా జనసేన పార్టీకి వారిద్దరూ విరాళమిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు..ఈ క్రిస్ట్‌మస్ పండుగకు వారి దగ్గర నుంచి సర్‌ప్రైజ్ రావడం తనకు సంతోషంగా ఉందన్నారు. జనసేన మీద వాళ్లకున్న అభిమానం, ప్రజల అభివృద్ధి మీద వాళ్లకున్న ఆకాంక్షను పవన్ కల్యాణ్ అభినందించారు. ప్రస్తుతం యూరప్ పర్యటనలో ఉన్న పవన్  ఆయన కుమారుడు శంకర పవనోవిచ్‌కు క్రిస్టియన్ మతాచారాల ప్రకారం చేయవలసిన కొన్ని లాంఛనాలను పూర్తి చేయడానికి పవన్ కల్యాణ్ తన సతీమణి అన్నా లెజెనోవాతో కలిసి యూరప్ వెళ్లారు. ప్రజలంతా సుఖ, సంతోషాలతో క్రిస్ట్‌మస్ పండుగ జరుపుకోవాలని, అంతేకాక యూరప్ పర్యటన అనంతరం తిరిగి వచ్చిన వెంటనే నాగబాబు, వరుణ్‌తేజ్‌ను కలిసి కృతజ్ఞతలు చెప్తానని ఆయన ట్వీట్ చేశారు.

leave a reply