గుజరాత్‌ కోర్టులో…పులి!

మాములుగా ఏ కోర్టులో వాదనలు వింటుంటాం, కానీ.. గుజరాత్‌లోని సురేంద్రనగర్ జిల్లాలోని చోటిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం ఒక సంఘటన చోటు చేసుకుంది. దారి తప్పి ఒక పులి కోర్ట్ ఆవరణలోకి చొరబడింది, దహెన్నీ గమనించిన వారందరు ఒక్కసారిగా పరుగులు తీశారు. దానిని చూసిన న్యాయమూర్తులు, లాయర్లు, సిబ్బంది అందరూ ప్రాణభయంతో పరుగులు తీశారు. కోర్టులో పోటాపోటీగా వాదనలు జరుగుతున్న సమయంలో ఎక్కడి నుండి వచ్చిందో తెలియక అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే కాసేపటికి తేరుకోని అందరిని హెచ్చరిస్తూ బయటకు పరుగులు తీశారు.. అదృష్టవశాత్తు అక్కడి వారికీ ఏ అపాయము జరగలేదు. అక్కడి సిబ్బంది చాకచక్యంగా పులిని కోర్టు లోపల నుంచి బయటకు రాకుండా తలుపు వేసేసారు. పోలీసుల సహాయంతో అటవీశాఖ అధికారులకి సమాచారం అందించారు. వారు పులిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

leave a reply