ఏపీలో.. నాటు బాంబుల కలకలం..!

గుంటూరు జిల్లాలో రెంటచింతలలోని మంచుకల్లులో నాటు బాంబులు కలకలం రేపాయి. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు స్వగ్రామమైన మంచుకల్లులో పోలేరమ్మ జాతర జరగనుంది. దీంతో పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో 15 నాటు బాంబులు లభ్యమయ్యాయి.యరపతినేనికి సోదరుడి వరుసైన యరపతినేని నరసింహారావు ఇంటి ముందు ఆగి ఉన్న కారు అడుగుభాగాన ఈ నాటుబాంబులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మంచుకల్లులో జరిగే జాతరకు రెండు రోజుల్లో యరపతినేనివెళ్లనున్నారు. ఆయన లక్ష్యంగానే ఈ బాంబులను అమర్చారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

leave a reply