పశ్చిమగోదావరి జిల్లాలోని పెరవలి మండలం ఖండవల్లి గ్రామంలోని ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్టణం జిల్లా పాకరేవుపేట మండలం నక్కపల్లి గ్రామానికి చెందిన భారతి(20) అనే యువతి స్థానికంగా ఉన్న ఒక ప్రైవేటు ఫ్యాక్టరీలో పనిచేస్తుంది. తన సోదరితో గొడవపడి శనివారం ఫ్యానుకు చున్నితో ఉరివేసుకుంది. సోదరి వచ్చేసరికి ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. వెంటనే దగ్గరలో ఉన్న తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆ యువతి మృతి చెందింది.
చున్నీకి వేలాడుతూ..
ఆత్మహత్య చేసుకున్న యువతి
Post navigation
Posted in: