దోషిగా తేల్చి.. శిక్ష వేశారు..!

రాయలసీమ ప్రాంతానికి చెందిన ఫ్యాక్షనిస్టు గంగుల సూర్య నారాయణరెడ్డి అలియాస్ మద్దెల చెరువు సూరి హత్య కేసులో నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ ను దోషిగా తేల్చిన న్యాయస్థానం అతనికి యావజ్జీవ శిక్ష విధించింది. అంతేకాకుండా మరో రూ.20,000 లు జరిమానా విధించింది. ఈ కేసులో నిందితుడు మన్మోహన్ కు విధించిన యావజ్జీవాన్ని ఐదేళ్లకు కోర్టు తగ్గించింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న సుబ్బయ్య, వంశీధర్, వెంకటరమణ, హరిలను నిర్దోషులుగా విడుదల చేసింది.

అనంతపురానికి చెందిన టిడిపి మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడైన సూరి 2011 జనవరి 4న  హైదరాబాద్‌లోని నవోదయ కాలనీలో హత్యకు గురయ్యాడు. సూరి కారులో వెళ్తుండగా భానుకిరణ్‌ తుపాకీతో కాల్చి పరారయ్యాడు.  2012లో భానుకిరణ్ ను జహీరాబాద్ లో పోలీసులు అరెస్టు చేశారు.ఈ కేసును మొదట బంజారాహిల్స్‌ పోలీసులు దర్యాప్తు చేసి, తర్వాత సీఐడీకి అప్పగించారు. సూరి హత్య కేసులో నిందితుడు భానుకిరణ్‌ ప్రస్తుతం మరో కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. తుపాకుల అక్రమ తయారీ కేసులో అతడితోపాటు మరో ముగ్గురికి నాంపల్లి కోర్టు శిక్షను ఖరారుచేసింది.

సూరి భార్య వాంగ్మూలంతో ఈ కేసు విచారణ ప్రారంభమైంది. ఏడేళ్ల తర్వాత ఈ కేసుకు సంబంధించిన తుది తీర్పు వెలువడింది. ఈ కేసులో నాంపల్లి కోర్టు 92 మంది సాక్షులను విచారించింది. సూరి డ్రైవర్ వాంగ్మూలం, భానుకిరణ్ వాడిన తుపాకీ, కాల్ డేటా ఆధారంగా కోర్టు భానును దోషిగా తేల్చింది.  

మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడైన సూరి 2011 జనవరిలో హైదరాబాద్‌లోని నవోదయ కాలనీలో హత్యకు గురయ్యారు. సూరి కారులో వెళ్తుండగా భానుకిరణ్‌ తుపాకీతో కాల్చి పరారయ్యాడని మధుమోహన్ పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ కేసును మొదట బంజారాహిల్స్‌ పోలీసులు దర్యాప్తు చేసి, తర్వాత సీఐడీకి అప్పగించారు. సూరి హత్య కేసులో నిందితుడు భానుకిరణ్‌ ప్రస్తుతం మరో కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. తుపాకుల అక్రమ తయారీ కేసులో అతడితోపాటు మరో ముగ్గురికి నాంపల్లి కోర్టు శిక్షను ఖరారుచేసింది. కోర్టు తీర్పుపై సూరి సతీమణి గంగుల భానుమతి హర్షం వ్యక్తం చేశారు. అయితే, యావజ్జీవ కారాగార శిక్ష మాత్రమే చాలదని ఉరిశిక్ష విదించి ఉండవలసింది అని ఆమె తెలిపారు.

leave a reply