పార్లమెంటు శీతాకాల సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి. అటు రాజ్యసభలోనూ, ఇటు లోక్సభలోనూ సభ్యుల ఆందోళనలకు స్పీకర్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా మొన్న లోక్సభలో కూడా 8 మంది టీడీపీ సభ్యులను స్పీకర్ సుమిత్రా మహాజన్ సస్పెండ్ చేయగా.. ఈ రోజు కూడా సభా కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారంటూ నలుగురు ఎంపీలను స్పీకర్ సస్పెండ్ చేశారు.
టీడీపీకి చెందిన చిత్తూరు ఎంపీ శివప్రసాద్ పాటు మరో ముగ్గురు అన్నాడీఎంకే ఎంపీలు పి.వేణుగోపాల్, రామచంద్రన్, గోపాల్పై రెండురోజులపాటు సస్పెన్షన్ విధించారు. విభజ హామీలు నెరవేర్చాలంటూ ఆరోజు ఎంజీఆర్ గెటప్లో టీడీపీ ఎంపీ శివప్రసాద్ స్పీకర్ పోడియం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అలాగే.. కావేరి జలాల అంశంలో తమకు కూడా న్యాయం చేయాలంటూ అన్నాడీఎంకే ఎంపీలు పెత్త ఎత్తున నినాదాలు చేశారు.