సోనియా అల్లుడుపై కేసు నమోదు

రాబర్ట్ వాద్రాకు ఎన్‌ఫోర్స్‌‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రాకు ఎన్‌ఫోర్స్‌‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. రాజస్థాన్‌లోని బికనీర్ సమీపంలోని కొలాయత్ వద్ద భూముల లావాదేవీలలో అక్రమాలు జరిగినట్లు నమోదైన కేసులో ఈ చర్య తీసుకుంది.

మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఈ కేసును 2015లో నమోదు చేసింది. చట్టవిరుద్ధ ప్రైవేటు వ్యక్తుల పేర్లపై భూకేటాయింపులు జరిగాయని రెవిన్యూ శాఖ నిర్థారించడంతో రాజస్థాన్ ప్రభుత్వం 374.44 హెక్టార్ల భూమి మ్యుటేషన్‌ను రద్దు చేసింది.

గతంలో స్కైలైట్ హాస్పిటాలిటీ కంపెనీకి కూడా ఈడీ సమన్లు ఇచ్చింది. ఈ కంపెనీ వాద్రాకు సంబంధించినదనే ఆరోపణలు ఉన్నాయి. వివాదాస్పద భూముల అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించిన పత్రాలను సమర్పించాలని ఈ కంపెనీని ఈడీ కోరింది.

leave a reply