కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. రాజస్థాన్లోని బికనీర్ సమీపంలోని కొలాయత్ వద్ద భూముల లావాదేవీలలో అక్రమాలు జరిగినట్లు నమోదైన కేసులో ఈ చర్య తీసుకుంది.
మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఈ కేసును 2015లో నమోదు చేసింది. చట్టవిరుద్ధ ప్రైవేటు వ్యక్తుల పేర్లపై భూకేటాయింపులు జరిగాయని రెవిన్యూ శాఖ నిర్థారించడంతో రాజస్థాన్ ప్రభుత్వం 374.44 హెక్టార్ల భూమి మ్యుటేషన్ను రద్దు చేసింది.
గతంలో స్కైలైట్ హాస్పిటాలిటీ కంపెనీకి కూడా ఈడీ సమన్లు ఇచ్చింది. ఈ కంపెనీ వాద్రాకు సంబంధించినదనే ఆరోపణలు ఉన్నాయి. వివాదాస్పద భూముల అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించిన పత్రాలను సమర్పించాలని ఈ కంపెనీని ఈడీ కోరింది.