గత కొన్ని రోజులుగా వరుస ట్వీట్స్ అండ్ వీడియోస్ షేర్ చేస్తూ మెగాబ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో బాగా బిజీగా ఉంటున్నారనే చెప్పవచ్చు. బాలకృష్ణను టార్గెట్ చేస్తూ చేస్తున్నారా..? లేక సరదాకి ట్వీట్ చేస్తున్నారా..! అనేది అర్థంకాక మోగా ఫ్యాన్స్కి, నందమూరి ఫ్యాన్స్కి మధ్య ఓ సోషల్ వార్నే జరుగుతుందనే చెప్పాలి.
ఎవరో చిన్న పిల్లోడు చక్కగా.. ముద్దుగా పాడాడు.. నాకు నచ్చింది.. నేను షేర్ చేసా.. అది తప్పేంటి..? గుమ్ముడికాయ దొంగ ఎవరూ అంటే బుజాలు తడుముకున్నట్టుంది మీ వ్యవహారం అంటూ నాగబాబు ఫైర్ అయ్యారు కూడా.. నేను ఎవరినీ ఏమీ అనలేదు.. అనే టైం వస్తే అంటా..? నాకు ఆ దమ్ముంది..? అయినా.. మీ పేరు పెట్టి అనలేదు కదా..! ట్వీట్ చేసే హక్కు కూడా నాకు లేదా..? అని ప్రశ్నించారు.
అయితే.. కొన్ని రోజుల క్రితం బాలయ్య తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల టైంలో మాట్లాడుతూ `సారే జహాసె అచ్చా’ అనే పాటను పాడారు. ఆ పాట అప్పుడు నెట్లో హాల్ చల్ సృష్టించింది కూడా.. అయితే దాన్ని ఉద్ధేశించే ఇప్పుడు నటుడు నాగబాబు ఈ పాటను పెట్టారంటూ నందమూరి ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే దానికి వివరణ ఇస్తూ నాగబాబు ఒక వీడియో తీసి, ముందు పోస్టుపై వివరణ ఇస్తూ షేర్ చేశారు.