మెగా కుటుంబం నుంచి హీరో సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ వెండితెరకు పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. ఎప్పటినుంచో వైష్ణవ్ రాకకు కసరత్తులు చేశారు. అయితే.. వైష్ణవ్ మొదటి సినిమా ప్రారంభోత్సవాన్ని సోమవారం రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన కుటుంబ సభ్యులు అందరూ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా.. చిత్ర బృందం వైష్ణవ్ మొదటి సినిమా ప్రీ లుక్ను ఆదివారం సాయంత్రం విడుదల చేసింది. ‘పంజా వైష్ణవ్’ అంటూ ఆయన గెటప్ను తెలియజేశారు. మత్య్సకారుడి గెటప్లో సముద్రం ఒడ్డున వైష్ణవ్ వల వేస్తూ గంభీరంగా కనిపించారు. కాగా ఈ సినిమాకు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో కలిసి సుకుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హీరోయిన్గా కొత్త అమ్మాయి మనిషా రాజ్ను పరిచయం చేయబోతున్నారు. అలాగే.. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో మిగిలిన నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.