టీమిండియా పురుషుల జట్టు బాటలోనే మహిళల జట్టు పయనిస్తోంది. నాలుగో వన్డేలో కోహ్లీ సేన క్లీన్స్వీప్ అవకాశం చేజార్చుకున్నట్లే, మిథాలీ ఆధ్వర్యంలో జరిగిన మూడో వన్డేలో పరాజయం పాలైన మహిళల జట్టు ఆఖరి వన్డే ఓటమితో క్లీన్స్వీప్ అవకాశాన్ని కోల్పోయింది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ మహిళల జట్టు టీమిండియాపై ఆలవోక విజయం సాధించింది. చివరగా జరిగిన మూడో వన్డేలో ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందిన కివీస్ 2-1 తేడాను తగ్గించింది. అయితే ముందు జరిగిన రొండు వన్డేలను భారత జట్టు గెలవడంతో సిరీస్ను చేజిక్కించుకుంది. ఈ వన్డేలో టీమిండియా 150 పరుగుల స్వల్ప స్కోరుకే పరిమితమవడంతో కివీస్ సునాయాసంగా విజయాన్ని అందుకుంది. కివీస్ స్టార్ బ్యాటర్ సజై బేట్స్ (57; 64 బంతుల్లో 8ఫోర్లు, 1 సిక్సర్), సారథి సాటర్త్వెయిట్ (66 నాటౌట్; 74 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్సర్)లు అర్థసెంచరీలు సాధించి కివీస్ విజయంలో కీలకపాత్ర వహించారు. సిరీస్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన స్మృతి మంధనాకు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు లభించింది.
అంతకముందు బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా కివీస్ బౌలర్ అన్నా పీటర్సన్(4/21)తో విజృంభించడంతో 149 పరుగులకే ఆలౌటైంది. ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కివీస్ కు బౌలర్లు రాణించడంతో విజయం సాధించారు. తొలి రెండు వన్డేల్లో పరవాలేదనిపించిన స్మృతి మంధన(1), రోడ్రిగ్స్(12), మిథాలీ(9)లు తక్కువ స్కోరుకే పరిమితమవడంతో టీమిండియా విజయావకాశాలు తగ్గిపోయాయి. ఈ క్రమంలో దీప్తి శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్లు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ నాలుగో వికెట్కు 48 పరుగులు జోడించిన అనంతరం హర్మన్ను పీటర్సన్ అవుట్ చేసింది. మరోవైపు వికెట్లు పడుతున్నా, దీప్తి శర్మ ఒంటరి పోరాటం చేసింది. ఈ క్రమంలో ఆర్ధసెంచరీ పూర్తి చేసుకున్న దీప్తి శర్మ(52) పీటర్సన్ బౌలింగ్లోనే పెవిలియన్ చేరింది. దీంతో విజయం కివీస్ను వరించింది. కివీస్ బౌలర్లలో పీటర్సన్ నాలుగు వికెట్లు పడగొట్టగా , లీ తహుహు మూడు వికెట్లు తీసుకున్నారు.