ఎప్పుడూ హ్యాపీగా..

ఆస్ట్రేలియాలో జరుగుతున్న చివరి టెస్టు‌ మ్యాచ్‌ నిమిత్తం విరాట్‌, అనుష్కతో పాటు సిడ్నీకి వెళ్లారు. అక్కడే న్యూయర్‌ సెలెబ్రేషన్స్‌ను చేసుకున్నారు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ క్రికెట్‌ గ్రౌండ్‌లోకి అడుగుపెట్టగానే అనుష్క స్టాండింగ్‌ గ్యాలరీలో నిలబడి తెగ చప్పట్లు కొట్టారు. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ గ్రౌండ్‌లో బంతులను బాదుతుంటే.. గ్యాలరీలో ఉన్న అనుష్క చప్పట్లు కొడుతూ సందడి చేశారు. ఆ సమయంలోనే ఫొటోగ్రాఫర్లు అనుష్క వైపు చూడగానే ఆమె సిగ్గుపడుతూ నవ్వారు. ఈ సందర్భంగా తీసిన అనుష్క ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. విదేశాల్లో మ్యాచ్‌ ఉన్నట్లైతే.. ‘విరుష్క’ జంట అక్కడే హాలిడేలను ఎంజాయ్‌ చేస్తుంటుంది.

అయితే.. రీసెంట్‌గా.. అనుష్క విరాట్‌తో కలిసి దిగిన చూడముచ్చటైన ఫొటోను యాడ్‌ చేస్తూ.. విరాట్‌ ఎప్పుడూ నన్ను హ్యాపీగా ఉంచుతాడు అంటూ ట్వీట్‌ చేశారు. విరాట్‌ను ప్రేమగా హగ్‌ చేసుకున్నట్లుగా ఉన్న ఈ ఫొటో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. అనుష్క పోస్ట్‌ చేసిన కొద్దిసేపటికే ఈ ఫొటోకు తొమ్మిదివేల మందికి పైగా లైక్‌ చేశారు.

leave a reply