టీమిండియా యువ ఆటగాడు పృథ్వీషా సిడ్నీ ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా కాలి మడమ గాయం కారణంగా స్వదేశానికి తిరిగొచ్చేశాడు. అయితే గాయం నుంచి త్వరగా కోలుకుంటున్నట్లు పృథ్వీషా తెలిపాడు. పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించేందుకు కృషి చేస్తున్నాడు పేర్కొన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ సరికొత్త సీజన్ ఆరంభమయ్యే లోపు పూర్తి ఫిట్నెస్తో సాధిస్తానని మీడియాతో వివరించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్లో ఓ క్యాచ్ అందుకోబోయి కాలి మడమ తిరగపడడంతో షా గాయపడ్డాడు. అతడి కాలి మడమ మలుచుకుపోయింది. దీంతో ఆస్ట్రేలియా నుంచి భారత్కు తిరిగి వచ్చేశాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆరంభానికి ముందే ఫిట్నెస్ సాధిస్తానని, అందుకోసం చాలా కష్టపడుతున్నా. కాలిమడమ శరీర పైభాగం పటిష్ఠగా మారేందుకు కసరత్తులు చేస్తున్నా… మ్యాచ్లో కాలిమడమ మలుచుకుపోవడం దురదృష్టకరం అని అన్నాడు. టెస్ట్ సిరీస్ ఆడకపోవడం నిరాశను మిగిల్చింది. ఆస్ట్రేలియాలో సవాల్ విసిరే పరిస్థితుల్లో ఆడటం నాకిష్టం. అక్కడి బౌన్స్ని నేను ఇష్టపడతా. దురదృష్టవశాత్తు గాయంతో ఆడలేకపోయాను. భారత్ టెస్టు సిరీస్ గెలిచినందుకు సంతోషంగా ఉంది. దీనికన్నా జరిగే మంచి ఏముంది అని పృథ్వీషా అన్నాడు. ఐపీఎల్లో షా దిల్లీ క్యాపిటల్స్కు ఆడుతున్న సంగతి తెలిసిందే.