ప్రత్యేకహోదా ఇవ్వమని.. మరోసారి స్పష్టం చేసిన కేంద్రం!

ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేకహోదా ఇవ్వమని మరోసారి స్పష్టం చేసిన కేంద్రం. ప్రత్యేక హోదా  కోసం అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ పార్టీలుఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్యసభలో తాజాగా ఈ డిమాండ్ పై కేంద్రప్రభుత్వం స్పందించింది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యపడదని  దానికి బదులుగా ప్రత్యేక ప్యాకేజీని ఇప్పటికే ప్రకటించామనికేంద్రం తెలిపింది. 14వ ఆర్థిక సంఘం నివేదిక ఆధారంగా ప్రత్యేక హోదాను దేశంలో అమలు చేయడంలేదని స్పష్టం చేసింది. విదేశీ సంస్థల ద్వారా ఏపీ పునర్నిర్మాణానికి సాయం చేస్తున్నట్లువెల్లడించింది. ఈవిషయంలో తమ వైఖరి  మారదని స్పష్టం చేసింది. టీడీపీ తమ నిరసనలను తెలిపే విషయంలో వెనుకంజ వేయట్లేదు. టీడీపీ పార్లమెంటు సభ్యుడు రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు జవాబు ఇచ్చింది.

leave a reply