3వేల మందిని కాపాడిన ఆర్మీ

భారత్‌-చైనా సరిహాద్దులో భారీగా మంచుకురుస్తోంది. దట్టమైన మంచు కారణంగా దాదాపు 3వేల మంది పర్యాటకులు మంచులో చిక్కుకుపోగా భారత ఆర్మీ వారిని రక్షించింది. నాథులా పాస్‌కు వెళ్లి వస్తున్న 300 వాహనాలు మంచులో చిక్కుకుపోయాయని రక్షణ శాఖ వెల్లడించింది. వారిలో స్త్రీలు, చిన్న పిల్లు ఎక్కువగా ఉన్నారని, వారికి ఆహారం, చలి దుస్తులు ఇచ్చామని తెలిపారు. అలాగే ప్రథమ చికిత్స కూడా అందించామన్నారు. వారంతా ఆర్మీ క్యాంపుల్లో సురక్షితంగా ఉన్నారని, రహదారిపై మంచును తొలగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

leave a reply