తొలి ప్రధాన న్యాయమూర్తిగా..

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి రాధాకృష్ణన్ చేత గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ సహా, పలువురు రాజకీయ ప్రముఖులు, న్యాయవాదులు హాజరయ్యారు. ప్రమాణస్వీకారం అనంతరం రాధాకృష్ణన్‌కు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

leave a reply