ప్రధాని నరేంద్ర మోడీతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ ముగిసింది. ఢిల్లీలోని 7 లోక కళ్యాణ్ మార్గ్లో ప్రధాని నివాసంలో సుమారు 40 నిమిషాల పాటు భేటీ జరిగింది. రెండోసారి సీఎంగా అయిన తర్వాత మొదటిసారి ప్రధాని మోడీని కలవడం. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన కాలంలో పెండింగ్లో ఉన్న హామీలను అమలు చేయాలని ప్రధానిని కేసీఆర్ కోరారు. అలాగే.. పలు రాజకీయ అంశాలపై కూడా ఇద్దరు నేతలు చర్చించినట్టు సమాచారం. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ రాష్ర్టానికి సంబంధించిన పలు అంశాలు, విభజన హామీలు సహా 16 అంశాలపై ప్రధాని మోదీతో చర్చించారు. అవి..
1. సెక్రటేరియట్, రహదారి
నిర్మాణ పనుల కోసం బైసన్ పోలో గ్రౌండ్ భూముల బదిలీ
2. కరీంనగర్లో
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్
టెక్నాలజీ ఏర్పాటు అంశం
3. హైదరాబాద్లో
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్
(ఐఐఎం) ఏర్పాటు
4. కొత్త
జిల్లాల్లో 21 జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటు
5. హైదరాబాద్లో
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్
ఎడ్యుకేషన్
6. ఆదిలాబాద్లో
సిమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా పునరుద్దరణ
7. నేషనల్
ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ – జహీరాబాద్ కోసం
నిధుల విడుదల
8. వరంగల్లో
కాకతీయ మెగా టెక్ట్టైల్ పార్క్
అభివృద్ధి కోసం రూ.1000 కోట్లు కేంద్రం నిధుల విడుదల
9. కృష్ణా
జలాల వివాద పరిష్కారానికి వినతి
10. కాళేశ్వరం
ప్రాజెక్టుకు జాతీయ హోదా
11. ఏపీ
పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన
12. ప్రతిపాదిత
రైల్వే ప్రాజెక్టుల పనుల పూర్తి అంశం
13. ఎస్సీ
వర్గీకరణ బిల్లు
14. వరంగల్లో
గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు
15. పునర్విభజన
చట్టం ప్రకారం వెనుకబడిన ప్రాంతాల కోసం రూ.450 కోట్లు గ్రాంట్స్ నిధులు విడుదల
16. ప్రధానమంత్రి
గ్రామ సడక్ యోజన ప్రతిపాదన