ప్రస్తుతం జరిగిన తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. బుధవారం తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్.. సీఎం కేసీఆర్గా ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు. అయితే కేసీఆర్కు ఆంధ్రప్రదేశ్లోనూ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. అందుకే.. కేసీఆర్ మీడియా సమావేశంలో ఏపీ రాజకీయాల్లోకి కూడా రావాలని ఉంది అని అనుంటారు. అయితే గుంటూరు జిల్లా తెనాలిలో.. తెలంగాణలో టీఆర్ఎస్ గెలిచిన సందర్భంగా కేసీఆర్ అభిమానులు కేక్ కోసి, రంగులు చల్లుకుని ఆనందంగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు షేక్ ఖాధీర్ మాట్లాడుతూ.. కేసీఆర్ నిజాయతీ గల నాయకుడని, తనను నమ్ముకున్న ప్రజలకు మేలు చేసినందునే మరోసారి ఆ పార్టీని పార్టీని గెలిపించారని అన్నారు.