న్యూయర్కి విషెస్ తెలుపుతూ నటుడు ప్రకాశ్ రాజ్ ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. న్యూయర్కి ఓ కొత్త కోరికతో.. ఇన్ని రోజులూ పరోక్ష రాజకీయాల్లో ఉన్నా.. ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నా అంటూ ప్రకాశ్ రాజ్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓ నియోజకవర్గం నుంచి తాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ట్విట్టర్లో తెలిపారు. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అంశాన్ని త్వరలో వెల్లడిస్తాను.’’ అని చెప్పారు.
కొంత కాలంగా నటుడు ప్రకాశ్రాజ్ ప్రధాని మోడీపై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. తన స్నేహితురాలైన కన్నడ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్ హత్యానంతరం ఆయన తన విమర్శలకు మరింత పదును పెట్టారు. ప్రకాశ్ రాజ్ ఈ విషయాన్ని ట్విటర్లో ప్రకటించగానే చాలా మంది సానుకూలంగా స్పందించడంతో పాటు రాజకీయ రంగంలో విజయం సాధించాలని ఆశిస్తూ రీ ట్వీట్లు చేశారు. పోస్ట్ చేసిన గంటలోపే దాదాపు వెయ్యి లైక్లు వచ్చాయి.