నాలుగేళ్లు వేచి చూశా..

ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చిన కారణంగా టీడీపీకి చెందిన ఈరన్న ఎన్నికను కొట్టివేస్తూ, రెండో స్థానంలో ఉన్న తిప్పేస్వామిని ఎమ్మెల్యేగా ఎన్నికైనట్లుగా ఉన్నత న్యాయస్థానం తీర్పును ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తిప్పేస్వామిచే అసెంబ్లీలో స్పీకర్‌ కోడెల ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పార్థసారథి, అంబటి రాంబాబుతో పాటు పలువురు వైసీపీ నాయకులు, తిప్పేస్వామి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

అనంతరం.. ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన తర్వాత డాక్టర్ తిప్పేస్వామి మాట్లాడుతూ ఈ కేసులో న్యాయం గెలిచిందన్నారు. నాలుగున్నరేళ్ల పాటు న్యాయపోరాటం చేశానన్నారు. ముఖ్యమంత్రి సహా టీడీపీ నాయకులు ఇచ్చిన ఏ హామీలు నిలబెట్టుకోలేదని విమర్శించారు.

ముఖ్యంగా.. హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా మడకశిరకు నీళ్లిస్తామన్న హామీని విస్మరించారని, తన పదవీ కాలంలో  ప్రభుత్వంపై పోరాటం చేసి, ప్రతి చెరువుకు నీళ్లు అందేలా చూస్తానన్నారు. పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ముందుకు సాగుతానన్నారు.

leave a reply