మరింత తగ్గుతున్న పెట్రోల్‌ ధరలు..!

నూతన సంవత్సరంలో ఇంధన ధరలు మరింత దిగొచ్చాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుతుండటంతో గత కొన్ని రోజులుగా దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. ఈ ఏడాది తొలిరోజున కూడా ఇంధన ధరలు మరికాస్త తగ్గాయి.

కాగా.. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర 19 పైసలు తగ్గి రూ. 68.65గా ఉంది. లీటర్‌ డీజిల్‌ ధర కూడా 20 పైసలు తగ్గి 62.66గా ఉంది. ఇక ఆర్థిక రాజధాని ముంబయిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 74.30, డీజీల్‌ లీటర్‌కు రూ. 65.56,  హైదరాబాద్‌లో రూ. 72.82గా ఉంది. డీజిల్‌ రూ. 68.11గా ఉంది.

రూపాయి పతనం, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో గతేడాది ఆగస్టు-సెప్టెంబరు కాలంలో చుక్కలను తాకిన ఇంధన ధరలు.. ఆ తర్వాత అక్టోబరు 18 నుంచి తగ్గుముఖం పట్టాయి. తాజాగా ఏడాది కనిష్ఠానికి పడిపోయాయి.

leave a reply