రేణుదేశాయ్ కొత్త…అవతారం

ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మరోసారి కెమెరా ముందుకు రానుంది. రేణుదేశాయ్ చేసిన సినిమాలు ఎక్కువ లేకపోయినా ఆమెకు ప్రేక్షకుల్లో గుర్తింపు బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ తో వివాహం అయినా తర్వాత ఆమె సినిమాల్లో నటించడం పూర్తిగా మానేసిన సంగతి తెలిసిందే.. అయితే ఇప్పుడు తాజాగా  బ్రాండ్ అంబాజిడర్ గా రాబోతున్నట్లు సమాచారం. 2003 లో రేణుదేశాయ్ నటించిన ‘జానీ’ తనకు లాస్ట్ సినిమా. కానీ ఇటీవల ఒకసారి టీవీ షోలో జడ్జిగా ఉన్నా అది ఎక్కువ కాలం సాగలేదు.

కళామందిర్ కళ్యాణ్ ఈమధ్యే రేణు దేశాయ్ తో కలిసి  ఒక బ్రాండ్ ఎండార్స్ మెంట్ డీల్ కుదుర్చుకున్నాడట.  ఈ డీల్ లో భాగంగా ‘కాంచీపురం వరమహలక్ష్మి సిల్క్స్’ బ్రాండ్ ను రేణు దేశాయ్ ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. ఈ బ్రాండ్ కు సంబంధించిన ఒక యాడ్ ఫిలిం షూట్ కూడా మొదలైనదని , షూట్ ను  చెన్నైలో జరిపారని సమాచారం. అయితే తను యాడ్స్ వరకే పరిమితం అవుతుందో లేక  సినిమాల్లోకి నటిగా మళ్ళీ రీ-ఎంట్రీ ఇస్తుందా అనేది వేచి చూడాలి.  ఈ యాడ్ షూటింగ్ నుండి ఒక ఫోటో ఇప్పటికే లీక్ అయ్యినట్లు తెలుస్తుంది.

leave a reply