సీఈసీతో తెలంగాణ సీఎం భేటీ..

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి సునీల్ అరోరాతో సమావేశమయ్యారు. తాజాగా జరిగిన ఎన్నికలు, పలు అంశాలపై సునీల్ అరోరాతో సీఎం కేసీఆర్ చర్చించారు. ఎంపీలు వినోద్ కుమార్, బండ ప్రకాశ్ సీఎం కేసీఆర్ వెంట ఉన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రధాని మోదీని కలిసి పలు కీలక అంశాలపై చర్చించిన విషయం తెలిసిందే.

కాగా.. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కారు గుర్తును పోలిన ట్రక్కు, ఇస్త్రీ పెట్టె వల్ల టీఆర్‌ఎస్‌కు నష్టం జరిగిందని సీఈసీ సునీల్‌ అరోరాకు సీఎం కేసీఆర్‌ వివరించారు. కావున లోక్‌సభ ఎన్నికల ముందే వాటికి సవరణలు చేయాలని కోరారు. ఇందుకు అరోరా కూడా సానుకూలంగా స్పందించారు.

leave a reply