జమ్ముకశ్మీర్లో భద్రతా సిబ్బందితో వెళ్తున్న ఓ బస్సు లోయలో పడిన సంఘటన జమ్ముకశ్మీర్లోని రాంబన్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి అధికారుల సమాచారం మేరకు ఈ ఘటనలో ఓ జవాను మృతిచెందగా.. 34 మంది గాయపడ్డట్టు తెలిసింది. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) దళానికి చెందిన కొంతంది సైన్యం కశ్మీర్లో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బంది తిరిగి విధులు ముగించుకుని సోమవారం వారు బుద్గామ్ నుంచి బయల్దేరి వస్తుండగా మార్గమధ్యంలో రాంబన్ జిల్లాలోని ఖునీ నల్లా ప్రాంతం వద్ద అదుపుతప్పి బస్సు లోయలో పడింది. అదృష్టవశాత్తు బస్సు పూర్తిగా లోయలో పడక పోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
అయితే ఈ సంఘటనలో ఓ జవాను ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ఘటనా సమయంలో బస్సులో 35 మంది భద్రతాసిబ్బంది ప్రయాణిస్తున్నట్లు వివరించారు. మిగిలిన 34 మందిని స్థానికుల సహాయంతో పోలీసులు రక్షించి లోయ నుంచి బయటకు తీసుకొచ్చారు. అనంతరం వీరందరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.