`వేగం’కు నలుగురు బలి..

గుంటూరు – చిలకలూరిపేట రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతున్న నలుగురు విద్యార్థులు మృతి చెందారు. వీరంతా ఆర్‌వీఆర్‌ అండ్‌ జేసీ ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. ఒకే కారులో న్యూయర్‌ వేడుకల్లో భాగంగా విజయవాడ వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు గుర్తించారు.

కాగా.. దాదాపు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన ఓ కారు డివైడర్‌ను బలంగా ఢీకొని అదే వేగంతో ఓ లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయ్యింది. కారు ఢీకొట్టిన వేగానికి లారీ సైతం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులోని నలుగురు విద్యార్థులు మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని గుంటూరు జీజీహెచ్‌కు తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రమాదంలో లారీ డ్రైవర్‌, క్లీనర్‌కు కూడా గాయాలయ్యాయి.

leave a reply