వేధింపులు భరించలేకనే ఇలాచేసా..

ఎప్పుడూ ఆకతాయిల వేధింపులకు అమ్మాయిలే బలవుతూంటారు. కొంతమంది దీన్ని భరిస్తూ బతికేస్తూంటారు.. లేక ఆత్మహత్యకు పాల్పడతారు.. కాని ఒక్కసారి వాళ్లు ఎదురుతిరిగితే.. ఇలానే ఉంటాది.

లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఓ వ్యక్తి మర్మాంగాన్ని కోసేసిన ఘటన ముంబైలోని డోంబివిలీలో జరిగింది. తుషార్ పుజారా (27) అనే ఆ యువకుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ అగాయిత్యానికి పాల్పడ్డ మహిళను, ఆమెకు తోడ్పడిన ఇద్దరు ఇతరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యాయత్నం నేరం కింద కేసు నమోదు చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. తుషార్ ఆ మహిళను ప్రతిరోజూ వేధిస్తున్నాడు. వెంటాడుతున్నాడు. శారీరకంగా తాకుతూ హింసిస్తున్నాడు. ఈ వేధింపులు భరించలేక ఆ మహిళ తుషార్‌ను వలలోకి లాగింది. సంకేత స్థలానికి వచ్చేలా చేసింది. అక్కడికి తుషార్ రాగానే మరో ఇద్దరు యువకుల సహాయంతో దాడిచేసింది. వారిద్దరు తుషార్‌ను గట్టిగా పట్టుకుంటే తాను ముందే తెచ్చుకున్న కత్తితో మహిళ అతడి మర్మాంగాన్ని కోసేసింది. తీవ్ర రక్తస్రావమవుతున్న తుషార్‌ను స్వయంగా హాస్పిటల్‌లో చేర్చింది. ప్రస్తుతం అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు.

leave a reply