గుంటూరు జిల్లా అచ్చంపేటలో జరిగిన జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. సభలో మాట్లాడుతుండగా సీఎంకు.. లోక్సభలో టీడీపీ ఎంపీలను సస్పెండ్ చేసిన విషయం తెలియగా.. అసంతృప్తి వ్యక్తం చేశారు. కనీసం మా బాధను చెప్పుకునే హక్కు కూడా లేదా అని ప్రశ్నించారు? ఆంధ్రప్రదేశ్కు మోడీ నమ్మకం ద్రోహం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన తర్వాత లోటు బడ్జెట్ ఉంది, దానికి తోడు రాజధాని, పరిశ్రమలు లేవు. రాజధాని శంకుస్థాపనకు పిలిచి పునాది వేయమని ఆహ్వానిస్తే.. మోడీ వచ్చి గుప్పెడు మట్టి, చెంబుడు నీళ్లు ఇచ్చారే తప్ప ఇంకేమిచ్చారు..? అని అన్నారు. దేశం మొత్తం ఎన్డీఏకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. దేశం మార్పు కోరుతోంది. ఈసారి ఎన్డీఏ ఓడిపోవడం ఖాయం. మేము దేనికీ భయపడం.. అందుకే ధైర్యంగా లోక్సభలో ఎదుర్కొంటున్నాం అన్నారు.
ప్రత్యేక హోదా అడిగితే మాట మార్చి.. ముగ్గురు మోడీలు ఒక్కటై ఆంధ్రప్రదేశ్పై కుట్ర చేస్తున్నారు. మనకు అన్యాయం చేశారనే కేంద్రం, ఎన్డీయే నుంచి బయటకు వచ్చాం. రాష్ట్రానికి కాంగ్రెస్ కంటే బీజేపీనే ఎక్కువ మోసం చేసింది. రఫేల్ మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా మోడీ సమాధానం చెప్పరు. రూ.2వేల నోట్లు వల్ల అవినీతి పెరిగింది గానీ తగ్గలేదు. కొందరు బ్యాంకులను మోసం చేసి పారిపోతే ఇప్పడు పట్టుకొస్తామంటున్నారు. పోలవరానికి రూ.7వేల కోట్లు ఇచ్చామంటున్నారు. ఇంకా రూ.74వేల కోట్లు ఇవ్వాలి. పోలవరాన్ని బీజేపీ కాదు.. కాంగ్రెస్ వాళ్లే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు’’ అని చంద్రబాబు వివరించారు.