వాదనలు పూర్తి.. తీర్పు రిజర్వ్‌

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మునిసిపాలిటీ పరిధిలో ఉన్న 2,081 గజాల స్థలాన్ని ప్రభుత్వ స్థలంగా పేర్కొంటూ రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. అయితే ఆ సీజ్ చేసిన స్థలంలో హీరో ప్రభాస్ ఇల్లు కూడా ఉంది. దీంతో ప్రభాస్ దీనిని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటీషన్ వేశారు. దీనిపై నేడు హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును మాత్రం కోర్టు రిజర్వ్‌లో పెట్టింది.

ఆ స్థలాన్ని ప్రభాస్ తండ్రి కొనుగోలు చేశారని.. దానిని రెగ్యులరేజ్ చేయమని ఎన్నోసార్లు అధికారులను ఆశ్రయించినప్పటికీ పట్టించుకోలేదని, తమ ఇంటిని సీజ్ చేసే సమయంలో కూడా తమకు ఎలాంటి సమాచారమివ్వలేదని.. ప్రభాస్ తరుఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ప్రభుత్వం కూడా ఎందుకు రెగ్యులరేజ్ చేయలేదో వివరిస్తూ స్పష్టమైన కౌంటర్‌ను దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో ఇరువర్గాల వాదనలూ విన్న కోర్టు తీర్పును రిజర్వ్‌లో పెట్టింది.

leave a reply