టీమిండియా ప్రస్తుతం తిరుగులేని ప్రతిభను కనబరుస్తుందని భారత మాజి ఆటగాళ్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ సంవత్సరం మేలో జరగబోయే మెగా టోర్నీకి ఇంగ్లండ్ వేదిక కాగా… ఈ ప్రపంచకప్ లో టీమిండియానే ఫేవరెట్ అని క్రికెట్ దిగ్గజం లెజెండ్ సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డాడు. ఈ మెగా టోర్నీలో కఠినమైన జట్టు ఏదైనా ఉందంటే అది భారత క్రికెట్ జట్టేనని అందులో ఎటువంటి సందేహం లేదని పేర్కొన్నాడు. ఈ సందర్భంలోనే న్యూజిలాండ్ గడ్డపై ద్వైపాక్షిక వన్డే సిరీస్ గెలిచినందుకు టీమిండియాకు అభినందనలు తెలిపాడు. ప్రస్తుతం ఏ దేశంలోనైనా, ఏ పిచ్పై అయినా టీమిండియా తన సత్తా చాటగలదని తెలిపాడు.
ప్రస్తుతం టీమిండియా జట్టు సభ్యుల ప్రతిభ అద్భుతంగా ఉందని, టీమిండియా వరుస విజయాల రికార్డులను బట్టి నేను చెప్పట్లేదు, ఆటగాళ్ల ప్రతిభను చూస్తే తెలుస్తుందన్నారు. ఈ జట్టు కూర్పు ప్రపంచంలోని ఏ దేశంలోనైనా ఎక్కడైనా సత్తా చాటగలదన్నాడు. ప్రస్తుతం టీమిండియా ప్రదర్శనలు చూస్తుంటే త్వరలో ఆరంభం కానున్న ప్రపంచకప్ టోర్నీలో టీమిండియానే హాట్ ఫేవరెట్ అని సచిన్ వివరించాడు.