ఇంగ్లాండ్ తో మూడు టెస్టుల సీరీస్ లో భాగంగా వెస్టిండీస్ రెండో టెస్ట్ విజయంతో తిరుగులేని ఆధిపత్యాన్ని కనపరుస్తూ 10 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ను చిత్తు చేసి సిరీస్ను చేజిక్కించుకుంది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే వెస్టిండీస్ 2-0తో కైవసం చేసుకుంది. 119 పరుగుల లోటుతో ఇన్నింగ్స్లో బరిలోకి దిగిన ఇంగ్లాండ్.. జేసన్ హోల్డర్ (4/43), రోచ్ (4/52) చెరో 4వికెట్లతో చెలరేగడంతో 132 పరుగులకే కుప్పకూలింది. 14 పరుగుల స్వల్ప లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్.. ఓపెనర్లు బ్రాత్వైట్ (5 నాటౌట్), క్యాంప్బెల్ (11 నాటౌట్) ఇద్దరు కలిసి 2.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించారు. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 187 పరుగులకు ఆలౌట్కాగా.. విండీస్ 306 పరుగులు చేసింది. ఈ విజయంతో మూడు మ్యాచ్ల సిరీస్లో వెస్టిండీస్ 2-0 ఆధిక్యం సంపాదించింది. అయితే కొన్ని సంవత్సరాల తరవాత ఇంగ్లాండ్పై వరుసగా రెండు టెస్టుల్లో నెగ్గడం విశేషం.
విజయంతో విండీస్… సిరీస్ కైవసం!
Posted in: