సూపర్ ఫామ్తో న్యూజిలాండ్లో టీమ్ఇండియా విజయంతో ఆరంభించింది. తొలి వన్డేలో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన పేసర్ మహ్మద్ షమీపై ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే కొనియాడాడు. భారత మోస్ట్ సక్సెస్ఫుల్ బౌలర్లలో షమీ ఒకడని భోగ్లే అభిప్రాయపడ్డాడు. ఈ విజయంలో భాగంగా కివీస్తో మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన షమీ వరల్డ్కప్ సిద్దమైనట్లు తెలిపాడు. టీమిండియా ప్రధానంగా వరల్డ్కప్ను దృష్టిలో పెట్టుకుని పలు ప్రయోగాలు చేసింది. భువనేశ్వర్, బూమ్రాలకు జతగా సరైన పేసర్ కోసం చాల కాలం అన్వేషించింది. ఈ సమయంలో షమీ ఫామ్లోకి రావడం శుభపరిణామం. వరల్డ్కప్కు ఇంగ్లండ్కు వెళ్లే భారత జట్టులో షమీకి చోటు ఖాయం. ఈ విషయంలో మాత్రం టీమిండియా యాజమాన్యం తగిన వ్యూహంతో ముందుకెళ్లాలి అని హర్షా భోగ్లే అభిప్రాయపడ్డాడు.
న్యూజిలాండ్లో తొలి వన్డేలో షమీ తన ప్రతిభతో మూడు వికెట్లు సాధించి ఆ జట్టు బ్యాటింగ్ పతనానికి నంది పలికాడు. మార్టిన్ గప్టిల్, కొలిన్ మున్రోలను బౌల్డ్ చేసిన షమీ.. మిచెల్ సాంత్నార్ను ఎల్బీగా పెవిలియన్కు పంపడంలో విజయం సాధించాడు. దాంతో న్యూజిలాండ్ భారీ స్కోరు చేయకుండా తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఈ మ్యాచ్లో కేవలం 157 పరుగులకే కివీస్ ఆలౌట్ కాగా, ఆపై భారత్ అలవోకగా, 34.5 ఓవర్లలో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.