వరల్డ్‌కప్‌కు…షమీ సిద్దమేనా!

సూపర్‌ ఫామ్‌తో న్యూజిలాండ్‌లో టీమ్‌ఇండియా విజయంతో ఆరంభించింది. తొలి వన్డేలో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన పేసర్‌ మహ్మద్‌ షమీపై ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే కొనియాడాడు. భారత మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ బౌలర్లలో షమీ ఒకడని భోగ్లే అభిప్రాయపడ్డాడు. ఈ విజయంలో భాగంగా కివీస్‌తో మ్యాచ్‌లో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచిన షమీ వరల్డ్‌కప్‌ సిద్దమైనట్లు తెలిపాడు. టీమిండియా ప్రధానంగా వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని పలు ప్రయోగాలు చేసింది. భువనేశ్వర్‌, బూమ‍్రాలకు జతగా సరైన పేసర్‌ కోసం చాల కాలం అన్వేషించింది. ఈ సమయంలో షమీ ఫామ్‌లోకి రావడం శుభపరిణామం. వరల్డ్‌కప్‌కు ఇంగ్లండ్‌కు వెళ్లే భారత జట్టులో షమీకి చోటు ఖాయం. ఈ విషయంలో మాత్రం టీమిండియా యాజమాన్యం తగిన వ్యూహంతో ముందుకెళ్లాలి అని హర్షా భోగ్లే అభిప్రాయపడ్డాడు.

న్యూజిలాండ్‌లో తొలి వన్డేలో షమీ తన ప్రతిభతో మూడు వికెట్లు సాధించి ఆ జట్టు బ్యాటింగ్ పతనానికి నంది పలికాడు. మార్టిన్‌ గప్టిల్‌, కొలిన్‌ మున్రోలను బౌల్డ్‌ చేసిన షమీ.. మిచెల్‌ సాంత‍్నార్‌ను ఎల్బీగా పెవిలియన్‌కు పంపడంలో విజయం సాధించాడు. దాంతో న్యూజిలాండ్‌ భారీ స్కోరు చేయకుండా తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో కేవలం 157 పరుగులకే కివీస్‌ ఆలౌట్‌ కాగా, ఆపై భారత్‌ అలవోకగా, 34.5 ఓవర్లలో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

leave a reply