కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడానికి సర్వం సిద్ధం చేసింది.ఈ వారంలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని .. లేదంటే వచ్చేవారం మొదట్లో నోటిఫికేషన్ ప్రకటించడం ఖాయమని ఈసీ వర్గాలు గురువారం వెల్లడించాయి. ఏప్రిల్-మే నెలల్లో ఏడెనిమిది దశల్లో పోలింగ్ జరుగుతుందని సమాచారం. లోక్సభతో పాటు అరుణాచల్ ప్రదేశ్,ఆంధ్రప్రదేశ్, ఒడిసా, సిక్కిం అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరుగనున్నాయి.జూన్ 3 నాటికి 16వ లోక్సభ పదవీకాలం ముగుస్తుంది. కనుక 17 వ లోక్సభ ఎన్నికల ఫలితాలు అంతకంటే ముందే వెలువడతాయి అని ఈసీ వర్గాలు వెల్లడించాయి.
జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి కూడా లోక్సభ ఎన్నికలతో పాటు ఎన్నికలు నిర్వహించాలని ఈసీ వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ శాంతిభద్రతల పరిస్థితి దృష్ట్యా ఎన్నికల నిర్వహణలో ఏమైనా మార్పులు ఉండవచ్చు అని ఒక అధికారి తెలిపారు.